
( అభిరుచిని గౌరవిస్తే … జీవన సాఫల్యం )
పుట్టిన పది నెలలకి పాల బువ్వ రుచి చూపిస్తారు. అదే అన్నప్రాసన. ఆ వేడుకలో చుట్టూ పెన్ను, పుస్తకం, డబ్బు దస్కం పెట్టి బాబు దేనిని ఎంచుకుంటాడో అని ఆత్రుతగా ఎదురు చూస్తారు. మనవాడు ఏది పట్టుకున్నాడో తెలీదు కాని పదో ఏట నుంచీ చిత్ర లేఖనం మీద మక్కువ పెంచుకున్నాడు.చాలామంది పిల్లలు తల్లితండ్రులు సూచించిన బాటలో సాగిపోతారు. బహు తక్కువ మంది పోరాడి, ఒప్పించి తమదైన జీవితం ఎంచు కుంటారు. రోహిణీ కుమార్ ఆ కోవకిచెందుతాడు.
School days లో ఇతగాడి చేత తమ note books మొదటి పేజీలో గణపతి బొమ్మ వేయించుకుందుకు సహాధ్యాయులంతా వరుస కట్టేవారు. టీచర్ల క్యారికేచర్ లు వేసి వారిని మెప్పించే వాడు .రోహిణీ కుమార్ మన కాలేజీ లో PUC (1963-64 Bi P )చదివాడు. పరీక్షలో ఇతడు రాసిన ఆన్సర్ ల ని బయాలజీ బొమ్మలు dominate చేసి మంచి మార్కులు తెచ్చిపెట్టేవి ( ఇడ్లీ కంటే చట్నీ బావుండినట్లు )
PUC అవగానే తనని శాంతినికేతన్ లో చేర్పించమని చేసిన ఒకరోజు నిరాహార దీక్షను తండ్రి గారు పట్టించుకోక … వరంగల్ పంపి ఆయుర్వేదం లో చేర్పించారు . అక్కడ వారాంతాల్లో ఓరుగల్లు కోటలోని శిల్పాకృతులు స్కెచ్ లు వేస్తూ తనలోని ఆర్టిస్ట్ ని బతికించు కున్నాడు.
సెలవులకి అమలాపురం వచ్చినప్పుడు మునిసిపల్ స్కూల్ డ్రాయింగ్ టీచర్ పేరి సుబ్బారావు గారి శిష్యరికం కొనసాగించేవాడు . పేరి సుబ్బారావుగారు much more than a drawing teacher. అయన artist. బహుముఖ ప్రజ్ఞాశాలి. Stage performer and humourist. అంటాడు రోహిణి కుమార్!.
ఆయుర్వేదం రెండో ఏడాదిలో మాధవరావు గారి పరిచయం కలిగింది. మాధవ రావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి . విజయనగరం లో పైడి రాజు గారి ఆర్ట్ స్కూల్ లో చదువుకున్నారు . వారి సాహచర్యం లో అనేక Art forms గురించి తెలుసుకున్నారు . శాంతినికేతన్ లాంటి ఆర్ట్ schools వివరాలను తెలుసుకున్నాడు .
రోహిణీ కుమార్ జీవితం ఒక పెద్ద మలుపు తిరగడానికి మాధవ రావు గారి శిష్యరికం కారణం అయ్యింది ఆ వేసంగిలో మాధవరావు గారితో కలిసి రామప్ప గుడికి Art camp కి వెళ్లడం… తన జీవిత గమ్యం గురించిన స్థిరమైన నిర్ణయం తీసుకోవడం… వరంగల్ వచ్చి రూమ్ ఖాళీ చేసి అమలాపురం వచ్చేయడం టకటకా జరిగిపోయాయి.
తండ్రి రెండవ ప్రపంచ యుద్ధపు రిటైర్డ్ Captain … Dr. E. B. Sankaram… Gun తీస్తాడని తెలిసినా భయపడలేదు. నిరసనలు , వాగ్వాదాలతో ఒక సంవత్సరం గడిచాక …రాజీ కుదిరింది. ఒప్పందం ప్రకారం రోహిణీ కుమార్ బ్రతుకు తెరువుకి పనికొచ్చే commercial art చదవాలి.మాధవరావు గారి సలహా మేరకి College of Fine Arts, Madras లో చేరాడు. మద్రాసు వాతావరణం పడక ఆ తర్వాతి సంవత్సరం నుంచీ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కి మారాడు . అదే సమయంలో మాధవరావు గారికి వరంగల్ నుంచి హైదరాబాద్ కు బదిలీ అయింది. కాలేజ్ లో తన ఆప్షనల్ కమర్షియల్ ఆర్ట్ … అయినా మాధవరావు గారి సాహచర్యంలో ఎక్కువ సమయం పెయింటింగ్ లోనే గడిచేది.
Fine Arts కాలేజీ అనుభవాలు study tours మరచిపోలేనివి . ఆ సందర్భాలలో వందల సంఖ్యలో sketch లకి డజన్లకొద్దీ landscape లకి చక్కటి అవకాశం దొరికి తన లోని ఆర్టిస్ట్ కి మెరుగులు దిద్దు కున్నాడు .
రోజూ ప్రత్యేకమైనదే… రోజుకో కొత్త అనుభవం…
మచ్చుకి ఒకటి… కాశ్మీర్… మంచు పర్వతాల మధ్య, గడ్డకట్టే చలిలో landscape చేయడం మర్చిపోలేనిది. అది INDO PAK boarder, రోహిణీ కుమార్ గురువుగారు కొండపల్లి శేషగిరిరావు గారు lanscape చేస్తుండగా BSF జవానులు వారిని రెండు మూడు గంటలపాటు నిర్భంధించి ఆ తర్వాత వదిలారట!.
మాధవరావు గారి ప్రేరణ వల్ల 1971 వేసవిలో విజయనగరం వెళ్లి పైడిరాజు గారి వద్ద life study కోసం Intensive training camp కి వెళ్లారు . పైడిరాజుగారు ఒక Legendary Artist . రోహిణి కుమార్ ని ఎంతో ప్రభావితం చేశారు .Fine Arts college లో పట్టా పుచ్చుకుని, కొన్నేళ్ల freelance అనుభవంతో తన స్వంత design studio తో నాంది పలికి, పదేళ్ల తర్వాత GDC creative Advertising పేరున హైదరాబాద్ లో Art combined with business మొదలు పెట్టాడు.
ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళినవారు రిటైర్మెంట్ ప్రకటించు కొని గ్రామాలకు తిరిగి రావడం అరుదుగా జరుగుతుంది .అలా కొన్నేళ్ల తరువాత 2008 లో తాను పుట్టిన మట్టి వాసన వెతుక్కుంటూ కోనసీమ కి తిరిగి వచ్చాడు.
శ్రీ శ్రీ అన్నట్లు .. కవిత్వమొక తీరని దాహం
Art కూడా అంతే అంటాడు.
తానింకా artist in the making అనే చెప్తాడు.అది రోహిణీ కుమార్ simplicity !