
విశాల భారత దేశం కొన్ని సమయాల్లో గణ రాజ్యాలుగా పరిపాలించబడింది . అనేక భాషలు , తెగలతో కూడిన ఈ భౌగోళిక భాగం ఒకే ఆత్మ కలిగి భారత జాతిగా మనుగడ సాగించింది అంటే … పాచ్యత్య చరిత్ర కారులకు నమ్మడానికి కష్టమైంది.!
చిన్ని, చిన్ని రాజ్యాలను ఏక ఖండంగా చేసిన ఘనత మాదే అని బ్రిటిష్ చెప్పుకున్న గొప్పల డొల్లతనం బయటపడి ఇప్పుడు మన దేశానికే ఒక ఆవిచ్చిన్న సంస్కృతి కలిగిన అతి పురాతన దేశంగా ప్రపంచం గుర్తిస్తోం ది ! దీని పేరే సనాతన ధర్మం !
ప్రజలలో అంతర్లీనంగా ఉన్న ఈ భావనకు వంద సంవత్సరాలుగా రాష్ట్రీ య స్వయంసేవక్ సంఘ్ వ్యక్తీకరించిన రూపంగా మన ముందు నిలిపింది !
దేశభక్తి, క్రమశిక్షణలతో కూడిన పౌర సమాజ నిర్మాణానికి RSS కృషి చేస్తోం ది . అటువంటి ఆదర్శానికి అంకితమైన ఒక కుటుంబం నుంచి మన గొట్టుముక్కల భాస్కర్ వచ్చారు.
గొట్టుముక్కల భాస్కర్ మన కాలేజీ లో ఇంటర్మీడియట్ ( MPC -1970-72) చదివారు .RSS కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు . కానీ చదువుని ఎప్పడు నిర్లక్ష్యం చేయలేదు . ఇంటర్ పాస్ అయ్యాక degree ఎక్కడ చదవాలి (?) మరొక ఊరు వెళ్లి RSS విస్తరణ కోసం పని చేస్తూ చదువుకోవాలని ఆయన కోరిక! పెద్ద రాద్ధాంతం లేకుండా తల్లి- తండ్రులూ
అనుమతించారు.
భాస్కర్ జీవితం లో ఒక నూతన అధ్యాయం మొదలయ్యింది.రామచంద్రపురం వెళ్లి కాలేజ్ లో చేరినప్పుడు అక్కడ RSS కు 2 శాఖలు ఉండేవి.మూడు సం|| ల భాస్కర్ కృషి ఫలితంగా మరో మూడు శాఖలు ఏర్పడి అవి 5 అయ్యాయి . సాయంకాలం ఒక గంటపాటు కలిసి కార్యక్రమాలు చేయడం కాకుండా స్వయం సేవకులతో సాన్నిహిత్యం పెంచుకొని వారి వ్యక్తిత్వంలో మార్పు తీసుకు రావాలన్నది భాస్కర్ విధానం !
సైకిల్ యాత్రలు , కార్తీక పౌర్ణమి సంబరాలు నిర్వహించి తన తోటి విద్యార్థులకు చేరువ అయ్యారు . వాదనతో కాకుండా ప్రవర్తనతో వారి పరిణతికి కృషి చేశారు . భాస్కర్ ప్రభావంతో ఇద్దరు RSS కోసం జీవిత కాలం పని చేయ నిశ్చయించారు.
డిగ్రీ పూర్తయ్యేటప్పటికీ దేశం లో ఎమర్జెన్సీ గొడవ మొదలయ్యింది . ఇది ధర్మానికి సంబంధించిన అంశం కాదు . RSS ను ఒక మత సంస్థగా అభివర్ణిం చే వారికి సమాధానం ఇస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించి జైళ్ళకు వెళ్లి భాస్కర్ లాంటి స్వయం సేవకులు దేశభక్తి గల ఉత్తమ పౌరులుగా తమను తాము నిరూపించుకున్నారు .
చదువు పూర్తి అయ్యాక భాస్కర్ పూర్తి సమయం ప్రచారక్ గా మారాలని తలచారు దీనికి కుటుంబ అనుమతి ఎలా పొందాలి(?)ముఖ్యంగా తన తల్లి స్పందన ఎలా ఉండొచ్చు (?) ఎలా ఒప్పించాలి (?) ఎన్నో ప్రశ్నలు ! ఊహించినట్లే తల్లి సంసారంజీవితం లో ఉండి కూడా దేశ సేవ చెయ్యవచ్చు అంటూ తనకు తెలిసిన గొప్ప వ్యక్తులను ఉదహరించారు. మొత్తానికి ఆమెను మిగతా కుటుంబ సభ్యులను ఒప్పించి పూర్తి కాల స్వయంసేవక్ గా భాస్కర్ జీవితం ప్రారంభించారు . కుటుంబానికి దూరంగా RSS కోసం జీవితాన్ని అంకితం చేశారు . ఆ జీవిత గమనం లో ఎన్నో గొప్ప అనుభవాలను పొందారు . మారు మూల పల్లెలకు వెళ్లి పనిచేశారు . వివిధ స్టాయిలకు చెందిన కుటుంబాలతో ముచ్చటించారు . తెలంగాణలో పని చేసినపుడు రజాకార్ల వలన నిమ్న వర్గాలు ఎన్ని కష్టాలను అనుభవించాయో తెలుసుకున్నారు . స్వామి రామానంద తీర్థ వారిని ఎలా సంఘటితపరచారో గ్రహించారు.
ఒక సమస్య వచ్చినపుడు సమాధానాల కోసం వెతకడం కాకుండ జాతిని దృఢ పరచి విపత్తులను సంఘటితంగా ఎదుర్కొని పోరాడటానికి సంసిద్ధం చేయాలనే RSS వ్యవస్థాపకుల భావన సరైనదే అంటారు బాస్కర్.!
సింగపూర్ , ఇజ్రాయెల్ దేశాలు తమ పౌరులకు మిలటరీ శిక్షణనిస్తే, కీర్తించే మనం, స్వయం సేవకులకు RSS కనీస శిక్షణ గరిపి దేశభక్తి నిండిన ,ఉత్తమ పౌరులుగా నిలబెడదామంటే…వారిని అనుమానంగా చూస్తాం . ఇది ఒక colonial mindset ! 75 సం ల తరువాత ఇప్పుడే కొంత మార్పు కనబడుతుంది.
గొట్టుముక్కల భాస్కర్ లాంటి వారి కృషి వృధా పోదు. ప్రస్తుతం గొట్టుముక్కల భాస్కర్ ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రా లకు “ప్రచారక్ ప్రముఖ్ “ గా వ్యవహరిస్తున్నారు.
|| జై హింద్ ! ||