Author name: gloriousskbralumni.org

Blog

దాసు వామన దామోదర్ రావు ( దాము)

బహుముఖ ప్రజ్ఞాశాలి దాసు వామన దామోదర్ రావు ( దాము) బహుముఖ ప్రజ్ఞాశాలి కాలేజీ విద్యార్థులతో ఆరోజు హైస్కూల్ గ్రౌం డు కోలాహలంగా ఉంది . లెక్చరర్ – స్టూడెంట్ టీమ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది . అది సరే! కేప్టెన్ లు ఎవరో తెలుసా ? ఒక సీనియర్ స్టూడెంట్ తన జూనియర్ స్నేహితుడిని క్విజ్ చేస్తున్నాడు.సమాధానం కోసం ఎదురు చూడకుండా రెట్టించిన ఉత్సాహంతో తానే చెప్పేసాడు. తెలుసుకో …. ఇది తండ్రి కొడుకుల మధ్య పోటీ …. ఎవరు నెగ్గుతారో (?) టెన్షన్ గా అన్నాడు .లెక్చరర్స్ టీమ్ కు HOD Physics ఉపేంద్ర రావు గారు కేప్టెన్ …. మరి స్టూడెంట్సు టీమ్ కు వారి కుమారుడు దామోదర్ రావు కేప్టెన్. ఆట రంజుగా జరిగింది. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా అందరు బాగా ఎంజాయ్ చేసారు.అసలు దాము మన కాలేజీ లో చేర వలసిన వాడు కాదు. Twelfth లో అతను స్కోర్ చేసిన మార్కులు అతనికి మెడిసిన్ లో సీటు సంపాదించాయి. అయినా … తండ్రి ఉపేంద్ర రావు గారి సలహా మేరకు IAS లక్ష్యం గా BSc లో చేరారు.చదువుతో పాటు క్రికెట్ , వ్యాసరచన, వక్తృ త్వ పోటీల్లో దాము మొదటి స్థానంలో నిలిచే వాడు !అమలాపురం MP BS Murthy స్మారక Gold Medal విజేత మన దాము. ఆయనతో కొంచెం పరిచయమున్న వాళ్ళందరు దాము ని ఒక IAS in making గా చూసేవారు.తాను చదువుకొంటూ PUC విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. తనకంటే మంచి మార్కులు పొందిన తోటి విద్యార్థులను అభినందించి వారి ప్రతిభ ను చూసి పొంగి పోయేవాడు .ASR గారు అప్పుడే మన కాలేజీలో Physics Lecturer గా చేరారు.తన క్లాసు లో చదువుతున్న చీమలపాటి సూర్యనారయణ ( సురేష్) ను ఆయన వద్దకు తీసుకు వెళ్లి మాష్టారు ఇతను maths లో 300 కి 300 మార్కులు score చేసాడండి(!) అని పరిచయం చేసి మురిసి పోయాడట .కందా భాస్కరమ్మ గారు ( HOD mathematics) ఎప్పుడైన శలవు పెట్టినపుడు ప్రిన్సిపాల్ రమేశం గారు ఆక్లాసు తీసుకోవడం ఒక రివాజు . ఒకపరి అలా రమేశం గారు దాము వాళ్ళ క్లాసు తీసుకున్నారు. Maths సిలబస్ లో లేని కొన్ని ప్రోబ్లెమ్సును గురించి వివరిస్తున్నపుడు మద్యలో బెల్ విపించడంతో ఆగి పోయి ఇది చాలా కష్టతరమైనది మళ్ళీ ఎప్పుడైన చెపుతాను అని వెళ్ళిపోయారట. Suresh గా పిలువబడే దాము క్లాస్మేట్ దానిని రెండు పద్ధతుల్లో solve చేయవచ్చు అని దాము కు చూపాడట. దాము అతను వద్దన్న వినక చేయి పట్టుకొని రమేశం గారి వద్దకు తీసుకు వెళ్ళి విషయం వివరించాడట. రమేశం గారు చాలా సంతోషించి సురేష్ ను అభినందిస్తే అతని కంటే ఎక్కువ దాము సంతోషపడి పోయాడట. ఈ విషయం సురేష్ స్వయంగా చెప్పారు. AU లో MSc ( Physics) పూర్తిచేసి 1974 లో తిరిగి అమలాపురం చేరుకొని తన సివిల్స్ పరీక్ష కోసం చదువు మొదలు పెట్టాడు.సరే ! సివిల్స్ కి టైమ్ ఉందికదా అని Bank Probationary exam రాసారు.interview కి పిలుపు వచ్చింది. Mr PV ( English) దాము కి mock interviews ను కండక్ట్ చేసేవారు. SBH లో select అయ్యినట్లు లెటర్ వచ్చింది. ఏంచేయాలి?దాము dilemma లో పడ్డాడు. మధ్యతరగతి కుటుంబంలో పెద్దకొడుకు తీసుకొనే నిర్ణయమే దాము కూడా తీసుకున్నాడు.Bank ఆఫీసర్ ఉద్యోగం లో చేరి సివిల్స్ కు తిలోదకాలిచ్చాడు.దాముకి అమలాపురం అన్నా తాను చదివిన SKBRC అన్నా వల్లమాలిన ప్రేమ! bank ఉద్యోగంలో కొనసాగేటప్పుడు కూడాఎందరో యువకులను దాము తన రూమ్ లో ఉంచుకొని భోజనం పెట్టి competitive exams కి తర్ఫీదునిచ్చి సాయం చేసేవాడు.తన రిటైర్మెంట్ తరువాత అమలాపురం ఒక institute పెట్టి సివిల్స్ తో సహా ఇతర పోటీ పరీక్షలకు మన కాలేజీ విద్యార్ధులకు శిక్షణ గరపాలని కలలు కన్నాడు. అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే … “బహుజన సుఖాయ బహుజన హితాయచ”అనే ఋగ్వేద మంత్రం గా చెప్పుకోవాలి!దురదృష్టం . చెన్నయ్ లో జరిగిన ఒక accident లో తన 39 వ ఏట దాము చనిపోయాడు.         GSAA కి దాము ఒక స్పూర్తి ప్రదాత ! దాము కల అమలాపురం లో “Training centre for competitive exams” ను సాకారం చేయడమే ఆయనకు మనం ఇవ్వగలిగిన నివాళి !

Blog

మంతెన సూర్యనారయణ రాజు(లైలా రాజు)పారిశ్రామికవేత్త​

SKBRC స్థాపించబడిన మొదటి దశకంలో అటు చదువుల్లోను ఇటు క్రీడల్లోను కూడా గొప్ప పేరు గడించింది. మన BasketBall క్రీడా కారులు ప్రతి సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీ టీమ్ , AP stare team లలో కనీసం 3-4, స్థానాలను భర్తీ చేసేవారు. ఆరోజుల్లో LRK , Joseph, బ్రహ్మానందం, కామరాజు , మంతెన సూర్యనారయణ రాజు లు గ్రౌండులో ఆడుతుంటే,ప్ప్రేక్షకుల కేరింతలతో మారుమోగి పోయేదట.మంతెన సూర్యనారయణ రాజు AU Basket ball టీమ్ కి captain గా National లో ఆడారు. ఆయన ప్రతిభను మెచ్చుతూ అనేక వార్తాపత్రికలు వ్యాసాలు, వార్తలను ప్రచురించేవి.మంతెన సూర్యనారయణ రాజు SKBRC ( 1957-60 ) లో BA చదివారు తరువాత నాగపూర్ లో MA ( Public Administration) distinction లో ఉత్తీర్ణత చెంది Ph D లో జాయిన్ అయ్యారు. తన పరిశోధన అంశంగా – “ తిరుమల తిరుపతి దేవస్థానం పాలన విధానం”ను ఎంచుకున్నారు. కానీ ఇతర పని ఒత్తిళ్ళవలన Ph D పూర్తి చేయ లేక పోయారు.మాచర్ల లో హ్యూమ్ పైపుల factory లో మేనెజర్ గా చేరారు. అక్కడ 4 సం లు పనిచేసిన తరువాత హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. కంపెనీ ప్రధాన యూనిట్ లో కార్మిక అశాంతి సమస్యలు వలన అప్పటికే ఒక సం నుంచి factory lock out లో ఉంది. సమస్యలలో నుంచే కొత్త అవకాశాలు పుడతాయని అంటారు కదా ! మన మంతెన సూర్యనారయణ రాజు కి అదేజరిగింది !యాజమాన్యం ప్రధాన factory లోని కార్మిక సమస్యను గౌరవయుతంగా పరిష్కరించి factory ని తెరిపించే బాధ్యతను సూర్యనారయణ రాజుకు అప్పగించింది. ఆయన రెండు నెలలు శ్రమ పడి సమస్యలను పరిష్కరించి ఉత్పత్తిని మొదలుపెట్టారు. ఆ యువకుడు తన శక్తి సామర్థ్యా లను నిరూపించుకున్నాడు . యాజమాన్యం ఆ యూనిట్ ని అతనికి అమ్మడానికిప్రతిపాదించింది. ఎంత గొప్ప అవకాశం !కానీ తమ కుటుంబంలో ఎవరు పరిశ్రమలను స్థాపించి నడప లేదు . ఆ అనుభవం తనతోనే మొదలవుతుంది. అది కష్టతరమైన నిర్ణయం గా మారింది. కుటుంబ సభ్యులు కలిసి వచ్చారు. రాష్ట్రం లో ఒక యువ పారిశ్రామిక వేత్త తన ప్రస్థానం మొదలు పెట్టారు.సూర్యనారాయణ రాజు దానిని ఒక challenge గా తీసుకున్నారు. 4 సం లలో వారి కష్టం ఫలించి ఆ సంస్థ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు కొనుగోలుదారుల మన్ననలను పొందాయి. సంస్థ first class హోదాను పొందింది. టెండర్లు అవసరం లేకుండానే ప్రభత్వ శాఖలకు సరఫరా చేసే స్థాయిని సాధించారు. అది 20 ఏళ్ళపాటు కొనసాగింది.Turn Around specialist : కంపెనీలు నీరసపడి మూతపడితే ( sick units) వాటికి ఋణాలు ఇచ్చిన బ్యాంకులు వేలం వేసి వాటిని కొత్త యాజమాన్యాలకు అప్ప చెపుతారు. చిక్కులను విడదీసి sick units లను లాభాల బాట పెట్టిం చడం industrialist లకు ఒక పెద్ద సవాల్. మన సూర్యనారయణ రాజుకు ఆ విద్య బాగానే పట్టు బడింది. మూత పడిన రెండు సిమెంటు రైలుస్లీపర్ ( పట్టాల కింద వాడే దిమ్మలు) యూనిట్ లను సిరామిక్ యూనిట్ లను కొనుగోలు చేసి లాభాల బాట పట్టించారు.ఎంత ఘనత సాధించారు !మంతెన సూర్యనారయణ రాజు కి దైవ భక్తి ఎక్కువే ! ఆయన వెంకన్న భక్తుడు. విశాఖ లో అనేక గుడులు నిర్మించి సమాజాన్ని ఆధ్యాత్మిక మార్గం లో నడిపించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఇప్పుడు 85 సం ల వయసులో కూడా ఆఫీసు వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తారు! Great కదా !

Blog

గండు రాజేశ్వర రావు IRS​

కోనసీమ నుంచి సెంట్రల్ సర్వీసెస్ కు వెళ్ళిన వాళ్ళు తక్కువ! మరీ అందులో డిగ్రీ చదువు తో UPSC పరీక్షను ఛేదించడం చిన్నవిషయం కాదు. ఇంకొంత ముందుకు వెళ్ళి చూస్తే బయోలజీ సబ్జెక్ట్ ను ఎంచుకొని సివిల్స్ గెలిచాడు… ఎవరీతడు( ?)అనిపిస్తుంది అతడెవరో కాదు .. మన గండు రాజేశ్వర రావు! గండు రాజేశ్వర రావు మన కాలేజీ లో B Sc (1968-71 ) చదివారు. Class లో ఉన్న మంచి విద్యార్థుల్లో అతను ఉండే వాడు ఒక సందర్భంలో Zoology Lecturer రామజోగేశ్వర రావు గారు క్లాస్ లో students ని ఉద్దేశించి MSc చేసి lecturer గానో మరొక ఉద్యోగం లోనో settle అయిపోవడం కాదు . Aim big ! UPSC exam ను crack చేయడానికి ట్రై చేయాలి అన్నారట.అప్పుడే గండు రాజేశ్వర రావు మనస్సులో సివిల్సుకి బీజం పడింది. 1971 లో B Sc Pass అయిన తరువాత UPSC Asst grade పరీక్ష రాసారు. ఆ పరీక్ష ను 1973 లో దేశం లో 30 వ rank సాధించి ఉద్యోగం సంపాదించారు. అది గండు రాజేశ్వర రావు గారి ఆత్మ స్థైర్యాన్ని పెంచింది.ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ తన లక్ష్యం కోసం చదువు మొదలు పెట్టారు . ఆరోజుల్లో సివిల్స్ కి అవసరమైన మెటీరియల్ సులువుగా దొరికే చరిత్ర, ఆంథ్రపాలజీ వంటి subjects ను optionals ఎన్నుకొని UPSC పరీక్షలు రాసేవారు. మరి రాజేశ్వరరావు మాత్రం తనకు ఇష్టమైన బయోలజీలోనే రాయాలవుకున్నారు. ఢిల్లీ లోని మిత్రులు వారించినా వారి మాట వినలేదు. 1977 లో UPSC EXAM crack చేసి IRS కి సెలెక్ట్ అయ్యారు. 1978 లో ముస్సోరి లోను తరువాత నాగపూర్ లో శిక్షణ పొందారు. అక్కడ Accountancy లో 100% మార్కులు సాధించామే కాక వివిధ అంశాల్లో మొదటి స్థానం లో నిలిచి ఆర్ధిక మంత్రి Gold Medal ను సాధించారు.మొదటి పోష్టిం గు కాకినాడ నుంచి పదవీ విరమణ చేసే వరకు గండు రాజేశ్వర రావు కెరీర్ మొత్తం సంచలనాలతో నిండిపోయింది. 1977 బాచ్ లోని 120 మంది ఆఫీసర్ లను ఒక్కసారిగా అధిగమించి Jr Administrative grade పొందారు.1990 లో లండన్ వెళ్ళి RIPA లో Advance Management కోర్సు చదివారు.ఆతరువాత Income Tax జాయింట్ కమీషనరు, కమీషనరు, DG investigations గా పని చేసారు . DG investigations గా ఆయన ఎన్నో High profile కేసులను ఛేదించారు వాటిలో బళ్ళారి ఇనుప ఖనిజం కేసు కూడా ఉంది. 2011 నుంచి చీఫ్ కమీషనరుగా పనిచేసి 2012 లో పదవీ విరమణ చేసారు.అయినా ప్రజ్ఞావంతులను ప్రభుత్వాలు వదులుకో లేవు కదా ! 86 మంది IAS , IRS ఆఫీసర్ లతో పోటీపడి కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రా లకుInsurance Ombudsman గా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయ్యారు. ఆ పదవి లో 2016 వరకు పనిచేసి 3000 కేసులను పరిష్కరించారు .2018 లో తిరిగి CVC చేత HAL/ Andhra Bank లకు Independent External Monitor ( Board Level) nominate చేయబడి 2021 వరకు పని చేసారు. గండు రాజేశ్వరరావు జీవిత గమనం ఎంతో ఫలవంతమైనది కదా !

Blog

Justice BSA Swamy

1959 కాలేజీ అడ్మిషన్లు పూర్తయ్యాయి. క్లాసులు కూడా మొదలై పోయాయి. యూనివర్సిటీ నుంచి ప్రత్యేక అనుమతి తో SKBRC లో BSc క్లాసులో ఒక విద్యార్థి చేరారు . అతని Roll no 115 A , పేరు BSA స్వామి. ఆ BSA Swamy కాలేజీలో గడిపిన మూడుసంవత్సరాలు చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు,విద్యార్థి రాజకీయాలలోఉత్సాహవంతంగా పాల్గొన్నారు. Debating, Elocution , నాటకాలు ఏమైన కానీండి పోటీలో స్వామీ ఉంటే బహుమతి ఆయనదే ! 1961-62 విద్యార్థి సంఘ ఎన్నికల్లో President గా పోటీ చేసి గెలిచారు. అప్పుడు చిగురులు తొడిగిన నాయకత్వ లక్షణం ఆయన జీవితం చివరి వరకు కొనసాగింది. AU నుంచి న్యాయపట్టా పొంది హైదరాబాద్ లో అల్లాడి కుప్పుస్వామి , శివశంకర్ వంటి ప్రముఖుల వద్ద జూనియర్ గా పనిచేసారు. 1974 లో స్వంతంగా High court లో Practice మొదలు పెట్టారు. న్యాయవాదిగా పనిచేస్తున్నపుడు యువ న్యాయవాదుల సంఘం పెట్టి వారి సమస్యలకు పరిష్కారాల కోసం పోరాటం చేసారు. సామాజిక న్యాయం : నిమ్న వర్గాల కోసం ఆయన పడిన ఆరాటం BC, SC, ST న్యాయవాదుల సంఘ నిర్మాణంలో ప్రస్పుటంగా కన్పడుతుంది. ఆయన, సర్ధార్ గౌతు లచ్చన అనుయాయి. Gouthu Lachanna Organisation for Weaker sections (GLOW) నిర్మాణానికి కృషిచేసారు. చైతన్య రధం లాంటి ఒక మోటారు కారును ఏర్పాటుచేసుకొని గ్రామ, గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గ ప్రజలను చైతన్య పరిచారు.వారి సేవలకు గుర్తింపుగా Periyar International (USA) BSA Swamy గారిని “K Veera Mani award” forsocial Justice తో గౌరవించింది. కొంత కాలం “మన పత్రిక “సంపాదకుడిగా పనిచేసారు. వ్యక్తిత్వం : స్వామి గారు బలహీన వర్గాల అభ్యున్నతి కోరుకున్నారు. కానీ వారికి ఇతర వర్గాల పట్ల ద్వేషం లేదు. రేడికల్ భావాలను కలిగి కూడా ఆయన atheist కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన పరిపూర్ణ మానవుడు ! Educationist : Justice Swamy తన తండ్రి పేరిట BRM Education society ని స్ధాపించి తమ స్వగ్రామం ముక్తేశ్వరం లో పోలీటెక్నిక్ కాలేజీ పెట్టారు. పోలీటెక్నిక్ కాలేజీ యే ఎందుకు ? ఇంజినీరింగు కాలేజీ పెట్టొచ్చు కదా అని మిత్రులు అంటే … జస్టిస్ స్వామి బలహీన వర్గాల పురోగతికి పోలీటెక్నిక్ తొలి మెట్టు అన్నారట. Justice BSA Swamy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో Judge గా 1995 నుంచి 2004 వరకుపనిచేసారు. 2008 లో Justice BSA Swamy గుండె పోటుతో మరణించారు.  వారు నెలకొల్పిన విద్యాసంస్థలు మాత్రం ప్రజా సేవలో పురోగమించాయి!

Blog

డా || కొండూరి గిరిజాగణేష్

మనిషికి అనేక ఇష్టాలు ఉండొచ్చు. కానీ తీవ్రత పెరిగి వాటిలో ఒకటి Passion గా మారితే అది ఒకటేమాత్రమే మిగులుతుందేమో! గిరిజా గణేష్ కి చదువు – పరిశోధనలు జీవిత పరమావధిగా మారి మరి ఏవీ అతనిని ఆకర్షిం చలేకపోయాయి ! గిరిజా గణేష్ మన కాలేజీ లో 1972-74 ల మధ్య ఇంటరు చదివారు. మార్కులను కొల్లగొట్టడం లో దిట్ట .గిరిజాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారట. క్లిష్టతరమైవ All India science Talent Test పాసై scholarship ను గెలుచుకున్నారు. గిరిజాగణేష్ ఎప్పుడు క్లాస్ టాపర్ గా నిలిచే వాడట. SKBRC ఎంతో మంది వైద్య నిపుణులను తయారు చేసింది. వారిలో కొండూరి గిరిజా గణేష్ మనమంతా గర్వించ తగిన ప్రపంచ స్థాయి వైద్యులలో ఒకరు! గిరిజాగణేష్ ను డాక్టరు గిరిజాగణేష్ గా ఆంధ్రా మెడికల్ కాలేజీ (1975-80) తీర్చి దిద్దింది. 1980-82 లో అతను మనదేశం లో ఖ్యాతిగాంచిన AIMS నుంచి PG ( Paediatrics) చేసారు. 1985 నాటికి అమెరిక లో రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేసారు. 1987 వాటికి University of Arkansas నుంచి Neonatology లో Fellowship పొందారు. 1919 లో University of Texas ( Dallas) నుంచి Healthcare management లో MS చేసారు Dr Konduri Girija Ganesh జ్ఞాన తృష్ణకు అంతులేదు.ఆయన చదివిన చదువులు, పరిశోధనల గురించి రాయాలంటే చాలా పేజీలు పడతాయి.|ఆయన Neonatology లో ప్రపంచ ఖ్యాతిని గడించారు.డా. Konduri Girija Ganesh గత 22 సం॥లుగా MCW (Newyork)లో Neonatology Chief గా ఉంటున్నారు.

Blog

విజ్ఞాన – వేదాంతాల సంగమ రూపం

స్వామి తత్వవిదానంద సరస్వతి( పూర్వాశ్రమ నామం: రాణి రామ కృష్ణ ) రాణి రామకృష్ణ గారు లౌకిక విద్య కోసం పాఠశాలలో చేరకముందే వేద, వేదాంగాలను ,సంస్కృత భాషా జ్ఞానాన్ని తన తండ్రి మహమహోపాధ్యాయ నరసింహ శాస్తి గారి నుంచి నేర్చుకొన్నారు. రాణి రామకృష్ణ గారు SKBRC లో 1966-69 మధ్య B.Sc (MPC) చదివారు. రామకృష్ణ ఆకాలంలో సహవిద్యార్థులకు ఎందరికో స్పూర్తి దాయకంగా నిలిచారు.ఆయనకు పాఠం చెప్పడానికి Lecturers మహదానంద పడేవారట! ఒకసారి Physics Lecturer ASR గారిని Stroboscope గురించి ప్రశ్నించినపుడుసాయంకాలం ఇంటికి వచ్చి కలవ మన్నారట. రామకృష్ణ. మరొక సహవిద్యార్ధి కలసి ASR గారింటికి వెళ్ళారట. ASR గారు అందుబాటులో ఉన్న Tablefan , light లను ఉపయోగించి Stroboscope concept ను explain చేసారట. అదీ విద్యపట్ల ఆ గురు-శిష్యుల కమిట్ మెంట్ !రామకృష్ణ గారికి చదువు తప్ప వేరే వ్యాపకాలు ఉండేవి కావుట. ఒకసారి వారి సహవిద్యార్ధి బలవంతం మీద సినిమాకు వెళ్ళారట. విరామంలో స్నేహితుడు బయటకు వెళ్ళి వచ్చేసరికి రామకృష్ణ గారు పుస్తకం చదువుకుంటూ కనిపించారట. ఇక ఆ స్నేహితుడు విస్తుపోవడం తప్ప మరేమి చేయగలడు చెప్పండి ?అతనితో అతనికే పోటీ ! CVS ( maths Lecturer) గారు చెప్పిన 5 problems ను solve చేసి, మళ్ళీ చేయడం మొదలు పెట్టారట. ఏమిటి మళ్ళీ చేస్తున్నావు అని అడిగితే ఇంతకు ముందు వీటిని solve చేసేందుకు 20 నిముషాలు పట్టిం ది. ఇంకెంత త్వరగా చేయగలనా(?) అని చూస్తున్నాను అన్నారట.అంతటి ప్రతిభావంతుడికి AU Gold Medal తో సత్కరించకుండా ఎలా ఉంటుంది? B Sc University first గా ఉత్తీర్ణుడు అయ్యారు. AU నుంచి M Sc ( chemistry ) తరువాత డాక్టోరేట్ పొందారు. SV University నుంచి సంస్కృతంలో డాక్టోరేట్ పొందారు. మహమహోపాధ్యాయ అనిపించుతున్నారు. వారు వేదార్ధం చెపుతూ రాసిన dissertation పలువురి ప్రశంసలను అందుకుంది. (Vedi సంస్కృతం , Classical సంస్కృతం కు కొంచెం భిన్నమైనది. బహు తక్కువ మందికి మాత్రమే అది తెలుసు.) UPSC పరీక్షలు వ్రాసి IPS కి సెలెక్టు అయ్యారు. కానీ వారికి విజ్ఞాన శాస్త్రం , పరిశోధనల మీద ఉన్న మక్కువ వలన IPS ను తిరస్కరించి. IDPL లో పరిశోధకుడి గా చేరారు. 15 సం ల సర్వీసు కాలం లో మన్ననలను పొందారు.ఆ తరువాత స్వామి దయానందా సరస్వతి ప్రేరణ తో రాణి రామకృష్ణ సన్యసించి స్వామి తత్వవిదానంద సరస్వతిగా మారారు.అధ్వైతవేదాంతం మీద 70 కు పైగా గ్రం ధాలను English , Sanskrit, Telugu భాషల్లో ఆవిష్కరించారు.హైదరాబాద్ తో సహా అనేక పట్టణాల్లో అధ్వైత వేదాంతంపై తరగతులను నిర్వహిస్తున్నారు. వారి ఉపన్యాసాలు కఠినమైన వేదాంత భావజాలాన్ని సామాన్యులకు సైతం అర్ధమయ్యేటట్లు సున్నితమైన హాస్యాన్ని జోడించి చెపుతారు. క్రమం తప్పకుండ సంవత్సరంలో కొన్ని రోజులు పెన్సిల్ ే నియా రాష్ట్రం లోని సేలోర్సబర్గ్లో ని ఆర్షవిద్యాపీఠం లో స్వామి తత్వవిదానంద వేదాలను బోధించి వస్తారు. కీ శే ఘనశ్యామ్ ప్రసాద్ గారు ఆ విద్యాపీఠాన్ని సందర్శించి స్వామి వారి బోధన పటిమను చూసి చాలా సంతోషపడినట్లు చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు “ప్రజ్ఞానం బ్రహ్మః“ అనే మహా వాక్యానికి సాకారం! .

Blog

క్రీడా రంగం (Sports)

Lutukurthy Rama Krishna Murthy (LRK MURTHY) Brief note of his services to SKBR college, Amalapuram & professional career. Lutukurthy Rama Krishna Murthy was born on 25-06-1932 at Chiruthapudi, Ambajipeta Mandal, DR Ambedkar Konassema district, AP. Education ZPH school, Amalapurum upto SSLC and College education in SKBR college After BA, college at its expenditure, admitted into B.com class to serve the sports field in the college. SERVICES TO SKBR COLLEGE, Amalapuram during 1956-59: University Championship. AWARDS AND REWARDS OF CENTRAL AND STATE GOVERNMENTS IN POLICE JOB CAREER

Scroll to Top